Bumrah Jansen Argument: సొంతగడ్డపై టీమ్ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్లో విజయం సాధించింది దక్షిణాఫ్రికా. అయితే.. జోహన్నెస్బర్గ్లో జరిగిన రెండో టెస్టులో భాగంగా భారత పేసర్ బుమ్రా, ప్రొటీస్ బౌలర్ జాన్సన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఐపీఎల్లో ఇద్దరు ఆటగాళ్లూ ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్నా ఈ వివాదం తలెత్తడం గమనార్హం. తాజాగా.. దీనిపై స్పందించాడు సౌతాఫ్రికా ఆటగాడు జాన్సన్. సొంత దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అని చెప్పుకొచ్చాడు.
"బుమ్రా, నేను ఐపీఎల్లో ఒకే జట్టులో ప్రాతినిధ్యం వహించాం. మేం మంచి మిత్రులం కూడా. కానీ, కొన్నిసార్లు పరిస్థితులు వేరేలా ఉంటాయి. దేశం కోసం ఆడినప్పుడు ఎవ్వరూ తగ్గరు. రెండో టెస్టులో జరిగింది ఇదే. కానీ, దాని గురించి పెద్దగా ఆలోచించను."
--జాన్సన్, దక్షిణాఫ్రికా పేసర్.
రెండో టెస్టులో బుమ్రా క్రీజులో ఉన్నప్పుడు వరుస బౌన్సర్ బంతులతో జాన్సన్ ఇబ్బందిపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. అంపైర్ చొరవతో వివాదం చల్లబడింది.
అదే ఊపులో వన్డే సిరీస్..