తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS AUS: రోహిత్​ హాఫ్​ సెంచరీ.. తొలి రోజు ఆట పూర్తి

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా టీమ్​ఇండియా ఆస్ట్రేలియా మధ్య తొలి రోజు ఆట ముగిసింది. గేమ్​ పూర్తయ్యేసిరికి టీమ్​ఇండియా 101 పరుగుల వెనుకంజలో ఉంది.

By

Published : Feb 9, 2023, 4:42 PM IST

Updated : Feb 9, 2023, 4:55 PM IST

IND VS Aus first test first day innings complete
బోర్డర్ గావస్కర్​ ట్రోఫీ తొలి రోజు ఆట పూర్తి

నాగ్​పుర్ వేదికగా జరుగుతున్న బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. మ్యాచ్​ ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్​లో భారత్​ ఒక వికెట్​ కోల్పోయి 77 పరుగులు చేసింది. ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ 20 పరుగులు చేసి టాడ్​ ముర్ఫీ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు. రోహిత్​ శర్మ 66 బంతుల్లో 56* పరుగులు చేశాడు. కాగా అశ్విన్(0*) ఖాతా తెరవలేదు. తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా జట్టు 177 పరుగులకు ఆల్​ఔట్ అయింది. దీంతో టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 100 పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 63.5 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లబుషేన్ (49) పరుగులతో రాణించాడు. స్టీవెన్​ స్మిత్ (37), హ్యాండ్​స్కోంబ్ (31), అలెక్స్ (36) పరుగులతో పర్వాలేదనిపించారు. కాగా, ఈ మ్యాచ్​లో భారత బౌలర్లు ఇరగదీశారు. ముఖ్యంగా చాలా రోజుల గ్యాప్​ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్​ ఆడుతున్న జడేజా తన ఆకలి తీర్చుకున్నాడు. 5 వికెట్లు తీసి కంగారూలకు ముచ్చెమటలు పట్టించాడు. అశ్విన్​ కూడా రాణించి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిరాజ్​, షమీ చెరో వికెట్​ తీశారు.

ఇదీ చూడండి: Srikar Bharat: అమ్మ ఆశీర్వాదం తీసుకుని.. అదిరిపోయే స్టంపౌట్​తో మెరిసి..

Last Updated : Feb 9, 2023, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details