Ranzi trophy Bengal players record: రంజీ ట్రోఫీలో భాగంగా ఝార్ఖండ్తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. చరిత్రలో నిలిచిపోయే ఆట ఆడింది. మ్యాచ్లో భాగంగా మూడో రోజు (బుధవారం) నాటికి 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
బెంగాల్ అదుర్స్.. తొలి 9 మంది 50 ప్లస్.. 129 ఏళ్ల రికార్డు బద్దలు - bengal nine players half century
Ranzi trophy Bengal players record: రంజీ ట్రోఫీలో.. చరిత్రలో నిలిచిపోయే రికార్డు నమోదైంది. సూమరు 129 ఏళ్ల రికార్డును బెంగాల్ జట్టు ఆటగాళ్లు బద్దలు కొట్టారు. అదేంటంటే..
![బెంగాల్ అదుర్స్.. తొలి 9 మంది 50 ప్లస్.. 129 ఏళ్ల రికార్డు బద్దలు ranzi trophy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15511549-thumbnail-3x2-ranzi.jpg)
ఓపెనర్తో మొదలు తొమ్మిదో ఆటగాడి వరకు ప్రతిఒక్కరూ అర్ధసెంచరీ చేయడం విశేషం. గతంలో 1893లో సుమారు 129 ఏళ్ల కిందట కేంబ్రిడ్జ్ యూనివర్సిటీపై 8 మంది ఆస్ట్రేలియా బ్యాటర్లు అర్ధశతకాలు చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది. బెంగాల్ బ్యాటర్లలో సుదీప్(186), అనుస్తుప్ మజుందార్(117) సెంచరీలతో అదరగొట్టగా.. అభిషేక్ రమన్(61), అభిమన్యు ఈశ్వరన్(65), మనోజ్ తివారి (73), అభిషేక్ పోరెల్(68), షాబాజ్ అహ్మద్(78), సయన్(53*), ఆకాశ్ దీప్(53*) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఝార్ఖండ్ మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 139 రన్స్ చేసి 634 పరుగుల వెనుకంజలో నిలిచింది.
ఇదీ చూడండి: దటీజ్ మిథాలీ రాజ్.. అతివల క్రికెట్ను అందలమెక్కించి