తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాబర్​​కు ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్​' అవార్డు - pakisthan captain babar azam icc player

ఏప్రిల్​కుగానూ ప్లేయర్​ ఆఫ్ ది మంత్​ అవార్డులను ప్రకటించింది ఐసీసీ. పాకిస్థాన్​ సారథి బాబర్​ అజామ్​, ఆస్ట్రేలియా మహిళా వికెట్ ​కీపర్​ అలీస్సా హేలీ​ ఈ పురస్కారాలను దక్కించుకున్నారు.

babar
బాబర్​​

By

Published : May 10, 2021, 4:48 PM IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ అవార్డును పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్ ఆజమ్ గెలుచుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్​లో అద్భతంగా ఆడినందుకుగాను అతడిని ఈ అవార్డు వరించింది.

ఈ సిరీస్​లో మూడో వన్డేలో 82 బంతుల్లో 94 పరుగులు, మూడో టీ20లో 59 బంతుల్లో 122 పరుగులు చేసి మ్యాచ్​ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు బాబర్. దీంతో అతడు 13 పాయింట్లు దక్కించుకుని, కెరీర్​లో అత్యుత్తమంగా​ 865 పాయింట్ల సంపాదించాడు.

హేలీ..

మహిళా విభాగంలో ఆస్ట్రేలియా వికెట్​కీపర్​ అలీస్సా హేలీ.. ఏప్రిల్​ నెలకుగానూ ఐసీసీ ఉమెన్​ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​గా నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్​తో జరిగిన సిరీస్​లో హేలీ.. మూడు వన్డేలు ఆడింది. ఇందులో 98.72 స్ట్రైక్​రేట్​, 51.66 సగటు​తో 155 పరుగులు చేసింది. వన్డే సిరీస్​ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. మొత్తంగా ఈ సిరీస్​లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచింది.

ఇదీ చూడండి:కొవిడ్ టీకా తొలి డోస్​ తీసుకున్న కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details