తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు' - స్టీవ్ హార్మిసన్ భారత్-దక్షిణాఫ్రికా సిరీస్

Steve Harmison on Ravi Ashwin: న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్​గా ఎంపికయ్యాడు టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్. అయినప్పటికీ అతడికి దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్​ల్లో అవకాశం దక్కుతుందో లేదోనని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్.

Steve Harmison on Team India, Steve Harmison ravi ashwin, స్టీవ్ హార్మిసన్ టీమ్ఇండియా, స్టీవ్ హార్మిసన్ రవి అశ్విన్
Team India

By

Published : Dec 7, 2021, 10:16 AM IST

Steve Harmison on Ravi Ashwin: త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను పక్కనపెట్టి.. ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానేను ఆడించినా ఆశ్చర్యపోనని ఇంగ్లాండ్‌ మాజీ పేసర్‌ స్టీవ్‌ హార్మిసన్‌ అన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అయినా, అతడిని టీమ్‌ఇండియా ఆ సిరీస్‌లో ఎంపిక చేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌ ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినా ఇంగ్లాండ్‌ పర్యటనలో జట్టు యాజమాన్యం పక్కనపెట్టిందని హార్మిసన్‌ గుర్తుచేశాడు.

"జట్టు ఎంపికలో కెప్టెన్ కోహ్లీ నిర్ణయాలే కీలకం. కానీ అతడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రేయస్, మయాంక్ శతకాలు బాదారు. దీంతో వారిద్దరూ ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లొచ్చని అనుకోవచ్చు. అలాగే రహానే, పుజారాను తుది జట్టులోకి తీసుకున్నా.. అశ్విన్‌ను పక్కనపెట్టినా.. నేను ఆశ్చర్యపోను. జడేజా కీలక ఆటగాడు. అక్షర్‌, అశ్విన్‌ లాంటి స్పిన్నర్లు బ్యాటింగ్‌ చేయగలిగినా జడేజానే ఏడో స్థానంలో సరైన బ్యాట్స్‌మన్‌. కాకపోతే.. అశ్విన్‌ కచ్చితంగా తుది జట్టులో ఉండాలి. ఎందుకంటే అతడు సీమ్‌ బౌలర్లకు ఏమాత్రం తక్కువ కాదు."

-స్టీవ్ హార్మిసన్, ఇంగ్లాండ్ మాజీ పేసర్

IND vs SA Series: సోమవారం దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్​లో మార్పు చేశారు. ఇంతకుముందు ప్రకారం డిసెంబరు 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా పర్యటన కాస్త ఆలస్యమయింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్‌పై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ వెల్లడించింది.

ఇవీ చూడండి: టెస్టు క్రికెట్​కు టీమ్ఇండియా అంబాసిడర్: శాస్త్రి

ABOUT THE AUTHOR

...view details