తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2021, 7:58 AM IST

ETV Bharat / sports

అది ఆటపై తీవ్ర ప్రభావం చూపుతోంది: అనిల్​ కుంబ్లే

క్రికెట్​ను ప్రజలకు చేరువ చేసేందుకు ఇన్ని రోజులు కీలక ప్రాత పోషించిన టీవీల స్థానంలో ఓటీటీల(cricket ott) పాత్ర ఎక్కువ అవుతుందని అన్నాడు స్పిన్​ దిగ్గజం అనిల్​ కుంబ్లే. భవిష్యత్​లో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) విధానంలో మరిన్ని మార్పులు సంభవిస్తాయన్నాడు.

anil kumble
అనిల్​ కుంబ్లే

ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత భారీగా పెరుగుతుందని, తద్వారా క్రికెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే అన్నాడు. భవిష్యత్​లో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌,drs system in cricket) విధానంలో మరిన్ని మార్పులు సంభవిస్తాయన్నాడు. అదే జరిగితే ఏ క్రీడాకారుడూ 'డేటా ఇంటిలిజెన్స్‌'ను కొట్టిపారేయలేరని కుంబ్లే పేర్కొన్నాడు. ఓ యూనివర్శిటీ ఏర్పాటు చేసిన 'బిల్డింగ్‌ కాంపిటిటివ్‌ అడ్వాంటేజ్‌ త్రూ స్పోర్ట్స్‌ అనలిటిక్స్‌ అండ్‌ డేటా ఇంటెలిజెన్స్‌' అనే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ స్పిన్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

క్రికెట్‌లో ఇప్పటికే డీఆర్‌ఎస్‌ విధానం అమలు చేస్తున్నారని, అది ఆటపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పాడు. ఈ టెక్నాలజీ మున్ముందు మరింత కొత్త పుంతలు తొక్కుతుందన్నాడు. ఆటగాళ్లు ఈ మార్పులను ఆహ్వానిస్తే బాగుంటుందని లేకపోతే వెనుకపడిపోతారని పేర్కొన్నాడు.

క్రికెట్‌లో సాంకేతికత అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా అది ఆటకు మంచి చేస్తుందని, అందుకే అది ఆహ్వానించదగ్గ విషయమని కుంబ్లే తెలిపాడు. ఈ క్రమంలోనే క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయని పేర్కొన్నాడు. ఇకపై టీవీలు, ప్రసారదారుల ప్రభావం అధికంగా ఉండదన్నాడు. క్రీడా సమాఖ్యలు సైతం ప్రజలకు చేరువ అయ్యేందుకు సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటారని అభిప్రాయపడ్డాడు. ఆటలను ప్రజలకు చేరువ చేసేందుకు ఇన్ని రోజులు టీవీలు ఆ పాత్ర పోషించాయని, ఇకపై ఓటీటీలు(cricket ott) వస్తాయని వివరించాడు. ఈ మార్పుల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశాడు. మరోవైపు క్రికెట్‌లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లు పెరిగేకొద్దీ 'డేటా ఇంటిలిజెన్స్‌' అధికమవుతుందని అంచనా వేశాడు. ఆటలు ఎంత చిన్నగా మారితే డేటా ఇంటిలెజెన్స్ వినియోగం అంత ఎక్కువగా ఉంటుందని అన్నాడు.

ఇదీ చూడండి: icc awards: ఆ శునకానికి ఐసీసీ అవార్డు

ABOUT THE AUTHOR

...view details