నాటింగ్హామ్ టెస్టులో గెలుస్తుందనుకున్న మ్యాచ్ డ్రా. లార్డ్స్లో ఘనవిజయం. లీడ్స్లో ఘోర పరాజయం.. ఇలా మూడు టెస్టుల్ని మూడు విభిన్న పంథాల్లో ముగించిన టీమ్ఇండియా నాలుగో టెస్టు(ind vs eng 4th test 2021)కు సిద్ధమైంది. లండన్ ఓవల్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం గెలుపు వ్యూహాలు సిద్ధం చేసింది. చివరి మ్యాచ్లో ఓటమి కసితో ఉన్న కోహ్లీసేన గెలుపు ఉత్సాహంతో జోరుమీదున్న రూట్సేనను ఏమేరకు అడ్డుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
త్రిమూర్తుల ఫామ్ ఎంతవరకు!
మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన పుజారా, కోహ్లీ(virat kohli) మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో పర్వాలేదనిపించారు. రహానే మాత్రం ఇంకా తన ఫామ్ నిరూపించుకోలేదు. కోహ్లీ కూడా సెంచరీ చేసి 50కిపైగా ఇన్నింగ్స్లు గడిచాయి. లీడ్స్లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 55 పరుగులతో మెరిశాడు. కానీ ఎడంగా వెళుతున్న బంతిని ఆడి ఔటై మరోసారి తన బలహీనతను బయటపెట్టాడు. పుజారా కూడా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడాడు. తన పంథాను మార్చి కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. లండన్ టెస్టులో గెలవాలంటే వీరిద్దరూ.. మరోసారి బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం ఉంది.
రహానే ఉంటాడా?
చివరి మూడు టెస్టుల్లో లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో చేసిన 61 పరుగులు మాత్రమే రహానేకు చెప్పుకోదగ్గవి. ఫామ్తో సంబంధం లేకుండా రెండేళ్లుగా రహానేకు అవకాశాలు వస్తున్నా.. జట్టును మాత్రం ఆదుకోవడంలో విఫలమవుతున్నాడు. దీంతో లండన్ టెస్టులో ఇతడి స్థానంలో సూర్య కుమార్ యాదవ్ లేదా హనుమ విహారీని తీసుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐదుగురు బౌలర్లకు స్వస్తి
ఆడిన మూడు టెస్టులో ఐదుగురు బౌలర్లతో ప్రయోగం చేసిన టీమ్ఇండియా చివరి టెస్టులో మాత్రం పూర్తిగా విఫలమైంది. టాపార్డర్లో రోహిత్(rohit sharma), రాహుల్ జట్టుకు శుభారంభాల్ని అందిస్తున్నారు. కానీ మిడిలార్డర్ విఫలమైతే ఇన్నింగ్స్ను గాడినపెట్టగల ఓ ఆల్రౌండర్ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆరుగురు బ్యాట్స్మెన్తో బరిలో దిగాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.
అశ్విన్కు చోటు