తెలంగాణ

telangana

ETV Bharat / sports

అత్యుత్తమ టెస్టు సారథులు.. వారి రికార్డులు!

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో భాగంగా జూన్​ 18న భారత్​, న్యూజిలాండ్​ జట్లు పోటీపడనున్నాయి. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు విరాట్​ కోహ్లీ, కేన్​ విలియమ్సన్​ ఇరుజట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్​ చరిత్రలో అత్యుత్తమ సారథులు, వారి గణాంకాల గురించి తెలుసుకుందాం.

By

Published : Jun 3, 2021, 8:57 AM IST

A look at 5 most successful captains in history of Test cricket
Cricket News: టెస్టుల్లో సక్సెస్​ఫుల్​ కెప్టెన్లు వీరే!

భారత్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్​గా విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేస్తున్నాడు. ధోనీ కెప్టెన్​గా ఉన్నప్పుడు టెస్టుల్లో నంబర్​ వన్​గా నిలిచిన టీమ్ఇండియా.. ఇప్పుడు కోహ్లీ సారథ్యంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. అదే ఉత్సాహంతో తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ను కైవసం చేసుకోవాలని చూస్తోంది కోహ్లీసేన. జూన్​ 18న న్యూజిలాండ్​తో జరగబోయే ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రపంచస్థాయి ఆటగాళ్లైన విరాట్​ కోహ్లీ, కేన్​ విలియమ్సన్​ ఇరుజట్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెస్టు ఫార్మాట్లో అద్భుత గణాంకాలున్న కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం.

స్టీవ్ వా(ఆస్ట్రేలియా 1999-2004)

స్టీవ్​ వా

క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికీ దాదాపు ఈ పేరు సుపరిచితమే. టెస్టు క్రికెట్​ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో స్టీవ్​ వా ముందంజలో ఉంటాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున 168 టెస్టులు ఆడిన స్టీవ్​ వా.. ఐదేళ్ల పాటు ఆ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు. స్టీవ్​వా సారథ్యంలో ఆడిన 57 మ్యాచ్​ల్లో 41 గెలుపొంది.. కేవలం 9 మ్యాచ్​ల్లో ఓడింది. కెప్టెన్​గా స్టీవ్​ వా విజయ శాతం 71.92. వా కెప్టెన్సీలో 1999 ప్రపంచకప్​ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది.

రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా 2004-10)

రికీ పాంటింగ్​

మరో క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఆస్ట్రేలియా విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 77 టెస్టులకు సారథిగా వ్యవహరించిన రికీ.. ​62.33 శాతం సక్సెస్​ రేటుతో 48 విజయాలు అందించాడు. మరో 16 మ్యాచ్​లు చేజారాయి. ఇతని నాయకత్వంలో ఆసీస్​ రెండు సార్లు ప్రపంచకప్​ను గెలుపొందింది​.

విరాట్ కోహ్లీ(ఇండియా-2014 నుంచి ప్రస్తుతం)

విరాట్​ కోహ్లీ

సుదీర్ఘ ఫార్మాట్​లో టీమ్ఇండియా తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. మాజీ సారథి ధోనీతో పాటు కోహ్లీ సమానంగా 60 టెస్టుల్లో ఇండియాకు నాయకత్వం వహించాడు. కానీ, ఇద్దరిలో విరాటే ఎక్కువ మ్యాచ్​లు గెలిపించిన ఘనతను అందుకున్నాడు. 60 శాతం విజయాలతో 36 మ్యాచ్​లను గెలిపించాడు కోహ్లీ. మరో 10 మ్యాచ్​లు డ్రాగా ముగియగా.. 14 టెస్టుల్లో ఓడిపోయింది. 2018-19 సీజన్​లో ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ విజయాన్ని సాధించిన జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించాడు. టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా మొత్తం 17 టెస్టుల్లో 520 పాయింట్లతో ఫైనల్​కు అర్హత సాధించింది టీమ్ఇండియా.

మైక్ బ్రేర్లీ(ఇంగ్లాండ్​ 1977-81)

ఇంగ్లాండ్ జట్టు​కు సారథ్యం వహించిన వారిలో విజయవంతమైన టెస్టు కెప్టెన్ మైక్ బ్రేర్లీ. ఇతడి కెప్టెన్సీలో 31 మ్యాచ్​ల్లో.. 18 విజయాలను నమోదు చేసుకుంది ఇంగ్లీష్ జట్టు. కేవలం 4 మ్యాచ్​ల్లోనే పరాజయం చవిచూశాడు. మరో 9 మ్యాచ్​లు డ్రాగా ముగిశాయి. సారథిగా మైక్ విజయాల శాతం 58.06.

కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్-2014 నుంచి ప్రస్తుతం)

కేన్​ విలియమ్సన్​

న్యూజిలాండ్ అత్యుత్తమ కెప్టెన్లలో కేన్ విలియమ్సన్ ముందంజలో ఉంటాడు. ఇంతవరకు 35 మ్యాచ్​ల్లో సారథిగా వ్యవహరించిన కేన్​.. 21 టెస్టుల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో 8 మ్యాచ్​లు ఓడిపోగా.. 6 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇతని విజయాల శాతం 60. 2019 ప్రపంచకప్​ జట్టుకు సారథిగా ఉన్నాడు విలియమ్సన్. ఇటీవల టీమ్ఇండియాను 2-0 తేడాతో ఓడించిన జట్టుకూ కెప్టెన్​గా వ్యవహరించాడు.

ఇదీ చూడండి:WTC Final: 'కివీస్ గెలవదు.. కారణాలివే..'

ABOUT THE AUTHOR

...view details