థాయ్లాండ్ ఓపెన్లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మలేసియాకు చెందిన సెల్వదురే కిసోనాను 21-15, 21-15 పాయింట్ల తేడాతో ఓడించి, రెండో రౌండ్కు దూసుకెళ్లింది. అనంతరం మ్యాచ్లో గెలిచినందుకు ఆనందం వ్యక్తం చేసింది.
బుధవారం జరిగిన అంతకు ముందు మ్యాచ్ల్లో కిదాంబి శ్రీకాంత్.. సౌరభ్ వర్మపై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. పారుపల్లి కశ్యప్.. పిక్క పట్టేయడం వల్ల మధ్యలోనే వైదొలిగి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.