థాయ్లాండ్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టాడు. తొలి మ్యాచ్లో సౌరభ్ వర్మపై గెలిచాడు. 21-12, 21-11 తేడాతో విజయం సాధించి, రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు.
థాయ్లాండ్ ఓపెన్: శ్రీకాంత్ రెండో రౌండ్లోకి - థాయ్లాండ్ ఓపెన్ న్యూస్
ప్రస్తుతం జరుగుతున్న థాయ్లాండ్ ఓపెన్లో శ్రీకాంత్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మన దేశానికే చెందిన సౌరభ్ వర్మపై విజయం సాధించి ముందంజ వేశాడు.
కిదాంబి శ్రీకాంత్
అంతకు ముందు తొలి రౌండ్లో పీవీ సింధు, సాయిప్రణీత్ ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించారు. సైనా, ప్రణయ్లకు తొలుత కరోనా పాజిటివ్గా తేలింది. మరోసారి పరీక్షలు చేయగా, నెగిటివ్ వచ్చింది. దీంతో బుధవారం వారి మ్యాచ్లు జరగనున్నాయి.
ఇది చదవండి:శ్రీకాంత్ గాయంపై వివరణ.. టోర్నీ నుంచి కశ్యప్ ఔట్