తెలంగాణ

telangana

By

Published : Sep 15, 2019, 10:48 AM IST

Updated : Sep 30, 2019, 4:20 PM IST

ETV Bharat / sports

వియత్నాం ఓపెన్​: ​టైటిల్​ పోరుకు సౌరభ్​ వర్మ

భారత్​ యువ షట్లర్​ సౌరభ్​​ వర్మ మరోసారి సత్తా చాటాడు. వియత్నాం ఓపెన్​లో ఫైనల్​ చేరి టైటిల్​కు అడుగుదూరంలో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్​ సెమీ ఫైనల్లో మినోరు కొగా(జపాన్​)ను ఓడించాడు.

సౌరభ్​ వర్మ

వియత్నాం ఓపెనలో భారత యువ షట్లర్​ సౌరభ్​ వర్మ ఫైనల్​కు చేరాడు. పురుషుల సింగిల్స్​ సూపర్ 100 విభాగంలో పోటీపడిన ఈ ఆటగాడు... శనివారం జరిగిన సెమీస్​లో మినోరు కొగా(జపాన్​)ను ఓడించాడు. ఈ మ్యాచ్​ను 22-20, 21-15 వరుస సెట్లలో గెలిచాడు సౌరభ్​. ఈ మ్యాచ్​ 51 నిముషాల పాటు సాగింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్​ ర్యాంకింగ్స్​లో 38వ ర్యాంక్​లో కొనసాగుతున్నాడు సౌరభ్.

మరో సెమీస్​ మ్యాచ్​లో లిన్​ యు హిన్​(తైవాన్​)ను 21-17, 21-16 తేడాతో ఓడించాడు సన్​ ఫీ జియాంగ్​(చైనా). ఆదివారం జరిగే ఫైనల్​ మ్యాచ్​లో సన్​తో​ తలపడనున్నాడు సౌరభ్​ వర్మ.

ఇదీ చూడండి: యాషెస్​: డెన్లీ డాషింగ్​- ఇంగ్లాండ్​ భారీ స్కోర్​

Last Updated : Sep 30, 2019, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details