తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రధాని మోదీని కలిసిన పీవీ  సింధు - gopichand

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ గోపీచంద్​ ప్రధాని మోదీని కలిశారు. ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన సింధును మోదీ అభినందించారు.

sindhu

By

Published : Aug 27, 2019, 2:02 PM IST

Updated : Sep 28, 2019, 11:17 AM IST

ప్రధానిని కలిసిన సింధు, గోపీచంద్, కిరణ్ రిజిజు

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం సాధించిన పీవీ సింధుకు దిల్లీ ఎయిర్​పోర్టులో ఘనస్వాగతం లభించింది. ముందుగా క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిసిన ఈ క్రీడాకారిణి అనంతరం ప్రధాని వద్దకు వెళ్లింది. సింధుతో పాటు గోపీచంద్, కిరణ్ రిజిజు మోదీని కలిసిన వారిలో ఉన్నారు.

"భారత్ గర్వించదగ్గ క్రీడాకారిణి పీవీ సింధును కలిసినందుకు ఆనందంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిందుకు అభినందనలు. భవిష్యత్​లో మరిన్ని పతకాలు సాధించాలి".
-మోదీ, ప్రధాని

ప్రపంచ ఛాంపియన్ షిప్​లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది సింధు. ఈ టోర్నీ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.

ఇవీ చూడండి.. ప్రధానిని కలవనున్న సింధు, గోపిచంద్​

Last Updated : Sep 28, 2019, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details