తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆదిలోనే సింధు ఓటమి - స్టార్ షట్లర్ పీవీ సింధు

ఆల్​ ఇంగ్లండ్​ ఛాంపియన్​షిప్​లో భారత క్రీడాకారిణి సింధు తొలి రౌండ్​లోనే ఇంటి ముఖం పట్టింది. దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ చేతిలో పోరాడి ఓడింది.

ఆదిలోనే సింధు ఓటమి

By

Published : Mar 6, 2019, 9:43 PM IST

బర్మింగ్‌హామ్ వేదికగా ఈరోజు ప్రారంభమైన ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌‌లో తొలిరోజే భారత్‌కు నిరాశ ఎదురైంది. అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ షట్లర్ పీవీ సింధు...తొలి రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్​లో 16-21తో ఓటమి పాలైన సింధు, రెండో సెట్​ను 22-20తో గెలుచుకుంది. చివరి సెట్​లో 17-21 తేడాతో ఓడిపోయి ఛాంపియన్​షిప్​ నుంచి నిష్క్రమించింది.

గత ఏడాది హాంకాంగ్‌ ఓపెన్‌లోనూ సుంగ్‌ చేతిలోనే ఓడింది సింధు. ఇది సింధుకు వరుసగా రెండో ఓటమి. మొత్తంగా 15 సార్లు ఈ షట్లర్లు ఢీకొనగా.. తెలుగు తేజం ఎనిమిదింట్లో పైచేయి సాధించగా.. ఏడింట్లో సుంగ్ గెలిచింది.

" నాపై ఆధిపత్యం సాధించడంలో సుంగ్ సఫలమయింది. నేను కొట్టిన స్మాష్​లు ఎక్కువగా నెట్​ను తాకి కిందపడిపోయాయి. ఇది నా దురదృష్టం. ఆమె చాలా బాగా ఆడింది." --పీవీ సింధు

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌‌లో ఇప్పటి వరకూ ఇద్దరు భారత షట్లర్లు మాత్రమే టైటిల్ గెలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొణె విజేతగా నిలవగా.. 2001లో పుల్లెల గోపీచంద్ టైటిల్ సాధించారు. ఈ టోర్నీలో ఏడుసార్లు పోటీపడిన సింధు.. కనీసం సెమీస్‌ను కూడా దాటలేకపోయింది.

ABOUT THE AUTHOR

...view details