తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండోనేసియా ఓపెన్​ ఫైనల్లో సింధు ఓటమి - యమగూచి

ఇండోనేసియా ఓపెన్​లో పీవీ సింధు రన్నరప్​గా నిలిచింది. జపాన్​కు చెందిన యమగూచితో జరిగిన ఫైనల్లో 15-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది.

ఇండోనేసియా ఓపెన్​ ఫైనల్లో సింధు ఓటమి

By

Published : Jul 21, 2019, 3:38 PM IST

Updated : Jul 21, 2019, 4:13 PM IST

భారత షట్లర్ పీవీ సింధు మళ్లీ నిరాశ పరిచింది. ఇండోనేసియా ఓపెన్​ ఫైనల్లో జపాన్​కు చెందిన యమగూచిపై ఓడిపోయింది. టైటిల్​ పోరులో వరుస సెట్లలో పరాజయం పొంది రన్నర​ప్​గా నిలిచింది.

సింధు ఓటమిపై ట్వీట్

ఇండోనేసియా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్-1000 టోర్నమెంట్​లో 15-21, 16-21 తేడాతో ఓటమి చవిచూసింది సింధు. ఈ ఇద్దరు ముఖాముఖి 14సార్లు తలపడగా పది సార్లు సింధునే గెలిచింది. కానీ ఈ సారి యమగూచిపై పట్టుసాధించలేకపోయింది.

ఈ సీజన్​లో సింధుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు సింగపూర్, ఇండియా ఓపెన్​లో సెమీఫైనల్​ వరకు వెళ్లగలిగింది సింధు.

ఇది చదవండి: వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు ప్రకటన

Last Updated : Jul 21, 2019, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details