డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. తొలి రౌండ్లో జపాన్ క్రీడాకారిణి సయకా చేతిలో 15-21, 21-23 తేడాతో ఓడిపోయింది. తొలి గేమ్లో 15-21తో ఓడిన సైనా, రెండోగేమ్లో ప్రత్యర్థిని ప్రతిఘటించింది. 20-16తో రెండో గేమ్లో మంచిస్థితిలో నిలిచింది. కానీ సయకా ఒక్కసారిగా విజృంభించి 23-21తో గేమ్ను సొంతం చేసుకుంది.
డెన్మార్క్ ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ
డెన్మార్క్ ఓపెన్లో భారత ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి నిరాశపర్చింది. తొలి రౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టింది.
డెన్మార్క్ ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ
ఈ ఏడాది తను పాల్గొన్న టోర్నీల్లో తొలి రౌండ్లోనే వెనుదిరగడం సైనాకిది మూడోసారి. మరోవైపు మిక్స్డ్ డబుల్స్లో భారత్ శుభారంభం చేసింది. ప్రణవ్ చోప్రా- సిక్కిరెడ్డి జోడీ జర్మనీ ప్రత్యర్థులను 21-16, 21-11 తేడాతో మట్టికరిపించింది.
ఇది చదవండి: డెన్మార్క్ ఓపెన్: ప్రీక్వార్టర్స్లోకి భారత యువ షట్లర్