తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ, సానియాలకు ఛాలెంజ్ విసిరిన సింధు - pv sindhu green india challenge

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించింది. అనంతరం కోహ్లీ, అక్షయ్ కుమార్, సానియా మీర్జాలను నామినేట్ చేసింది.

సింధు

By

Published : Nov 3, 2019, 9:57 AM IST

కొంతకాలంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. రాజకీయనాయకులు, సినీతారలు, క్రీడాకారులు ఈ ఛాలెంజ్​ను స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. తాజాగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించింది. ఈ సందర్భంగా మొక్కలు నాటిన ఫొటోలను సామాజికమ మాధ్యమాల్లో పంచుకుంది సింధు.

"నన్ను నామినేట్ చేసినందుకు తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇస్తున్నాను."
-సింధు, బ్యాడ్మింటన్ స్టార్

మరో ట్వీట్​లో "ఈ గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని నేను అభినందిస్తున్నాను. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు మూడు మొక్కలు నాటి.. మరో ముగ్గురిని నామినేట్ చేయాలి. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. నేను కోహ్లీ, అక్షయ్ కుమార్, సానియా మిర్జాలను నామినేట్ చేస్తున్నా" అంటూ చెప్పుకొచ్చింది.

ఇవీ చూడండి.. బుమ్రా రన్నింగ్.. అభిమానులు ఖుష్​

ABOUT THE AUTHOR

...view details