టోక్యో ఒలింపిక్స్లో స్టార్ షట్లర్స్ పీవీ సింధు, ప్రణీత్కు సులువైన డ్రా లభించింది. మహిళల సింగిల్స్లో ఆరో సీడ్ సింధు.. ప్రపంచ నంబర్ 34 చిగ్ గన్ యై( Cheung Ngan Yi), సెనియా పొలికర్పొవా(ఇజ్రాయెల్)తో తలపడనుండగా.. పురుషుల సింగిల్స్లో వరల్డ్ నెం.29 మార్క్ కాలిజో(Mark Caljouw, నెథర్లాండ్స్), మిషా జిల్బర్మన్(ఇజ్రాయెల్)ను ఎదుర్కొననున్నాడు.
Olympics: సింధు, ప్రణీత్కు సులువైన డ్రా - చిరాగ్ సాత్విక్ రాజ్ ఒలింపిక్స్ డ్రా
ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ లీగ్ దశకు సంబంధించిన డ్రాను ప్రకటించారు. భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, ప్రణీత్కు సులువైన డ్రా పడింది. చిరాగ్-సాత్విక్సాయిరాజ్ ద్వయంకు కొంచెం కష్టమైన ప్రత్యర్థులను ఎదుర్కొనున్నారు.
ఒలింపిక్స్
చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ జోడీకి మాత్రం బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనున్నారు. ఈ ద్వయం కెవిన్ సంజయ్ సుకముల్జొ, మార్కస్ ఫెర్నాల్డి(ఇండోనేషియా), లీ యంగ్, వాంగ్ చి లిన్(చైనా) జోడీ, ఇంగ్లాండ్ ద్వయం బెన్ లాన్, సీన్ వెండీతో తలపడనున్నారు. సింగిల్స్లో ప్రతిబృందంలోని టాప్లో నిలిచిన ప్లేయర్ నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు.
ఇదీ చూడండి: Olympics: స్వర్ణం సాధించాలని.. కోటి ఆశలు సింధుపైనే
Last Updated : Jul 9, 2021, 9:48 AM IST