తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2019, 11:57 AM IST

ETV Bharat / sports

చైనా ఓపెన్​ నుంచి సైనా ఔట్​.. రెండో రౌండ్లో కశ్యప్

చైనా ఓపెన్​లో భారత్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్​లోనే ఇంటిముఖం పట్టగా.. పురుషుల సింగిల్స్​లో పారుపల్లి కశ్యప్ రెండోరౌండ్​కు చేరుకున్నాడు.

చైనా ఓపెన్​ నుంచి సైనా ఔట్​.. రెండో రౌండ్లో కశ్యప్

చైనా ఓపెన్​లో భారత షట్లర్లు వరుసగా ఇంటిముఖం పడుతున్నారు. ఇప్పటికే పీవీ సింధు తొలి రౌండ్​లోనే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓడిపోయింది. మహిళల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన కై యాన్ యన్​ చేతిలో పరాజయం పాలైంది.

9-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓడింది సైనా. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ప్రత్యర్థి విజయం సాధించింది. కేవలం 24 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. రెండు సెట్లలోనూ చైనా షట్లరే ఆధిపత్యం చెలాయించింది.

పురుషుల సింగిల్స్​లో పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్​కు చేరుకున్నాడు. థాయిలాండ్​కు చెందిన సిట్టికోమ్​పై విజయం సాధించాడు. 21-14, 21-3 తేడాతో వరుస సెట్లలో నెగ్గాడు. 43 నిమిషాల్లోనే మ్యాచ్​ను ముగించాడు. తర్వాతి రౌండ్​లో డెన్మార్క్​ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సన్​ను ఢీకొట్టనున్నాడు.

పారుపల్లి కశ్యప్

మిక్స్​డ్ డబుల్స్ జోడీ ప్రణవ్ జెర్రీ - సిక్కి రెడ్డి చైనీస్ తైపీ ద్వయం వాంగ్ చీ లిన్ - చెంగ్ చీ యా చేతిలో పరాజయం పాలైంది. 14-21, 14-21 తేడాతో టోర్నీ నుంచి నిష్క్రమించిందీ జోడీ.

ఇదీ చదవండి: 'రెండో టీ20పై ఆత్మవిశ్వాసంతో ఉన్నాం'

ABOUT THE AUTHOR

...view details