తెలంగాణ

telangana

ETV Bharat / sports

మలేసియా ఓపెన్​లో ముగిసిన భారత్ పోరు - మలేసియా ఓపెన్​: క్వార్టర్స్​లోనే ఓడిపోయిన సైనా, సింధు

పతక ఆశలతో బరిలోకి దిగిన భారత స్టార్​ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్​, పీవీ సింధు మళ్లీ నిరాశపర్చారు. మలేసియా మాస్టర్స్​లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్​ మ్యాచ్​లో ఈ ఇద్దరూ ఓడిపోయారు. ఒలింపిక్స్​ ముంగిట ఈ ఏడాది జరిగిన తొలి మెగాటోర్నీలోనూ ఓటమిపాలవడం అభిమానుల్లో నిరాశకు గురి చేస్తోంది.

Malaysia Masters badminton 2020: PV Sindhu, Saina Nehwal knocked out in straight game of quarter-finals
మలేసియా ఓపెన్​: క్వార్టర్స్​లోనే ఓడిపోయిన సైనా, సింధు

By

Published : Jan 10, 2020, 4:26 PM IST

Updated : Jan 10, 2020, 4:52 PM IST

కౌలాలంపూర్‌ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్‌లో.. భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ల జోరుకు బ్రేక్​ పడింది. తోటి క్రీడాకారులంతా నిష్క్రమించినా సింధు, సైనా క్వార్టర్‌ఫైనల్​ వరకు చేరారు. అయితే పతకాలపై ఎన్నో ఆశలు రేపిన వీరిద్దరూ శుక్రవారం జరిగిన మ్యాచ్​ల్లో ఓటమిపాలయ్యారు.

టాప్​ సీడ్​పై...

మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో.. టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో 21-16, 21-17 తేడాతో ఓడిపోయింది 6వ ర్యాంకర్​ సింధు. 2019 ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్​షిప్​ గెలిచిన తర్వాత నుంచి సింధు మరో టైటిల్​ గెలిచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. అవేమీ ఫలించట్లేదు. ఈ చైనీస్​ క్రీడాకారిణితో ఇప్పటివరకు 17 సార్లు తలపడిన తెలుగమ్మాయి.. 12సార్లు పరాజయం చెందింది.

ఒలింపిక్​ ఛాంపియన్​పై...

శుక్రవారం జరిగిన క్వార్టర్స్​లో కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఖంగుతింది సైనా నెహ్వాల్​. 16-21, 16-21 తేడాతో తెలుగమ్మాయిని ఓడించిందీ ఒలింపిక్​ ఛాంపియన్​ కరోలినా.

పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 19-21, 20-22 తేడాతో లీ జియా (మలేసియా) చేతిలో, ప్రణయ్‌ 14-21, 16-21తేడాతో టాప్‌ సీడ్‌ కెంటొ మొమొట (జపాన్‌) చేతిలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పరాజయం చవిచూశారు.

Last Updated : Jan 10, 2020, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details