బ్యాడ్మింటన్లో మరో అంతర్జాతీయ టోర్నీ కొరియా ఓపెన్ నేటి నుంచి మొదలుకాబోతోంది. ఇందులో మహిళల సింగిల్స్లో సింధు, సైనా, పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్, కశ్యప్ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు.
టైటిల్ వేటలో సింధు...
బ్యాడ్మింటన్లో మరో అంతర్జాతీయ టోర్నీ కొరియా ఓపెన్ నేటి నుంచి మొదలుకాబోతోంది. ఇందులో మహిళల సింగిల్స్లో సింధు, సైనా, పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్, కశ్యప్ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు.
టైటిల్ వేటలో సింధు...
ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణం తర్వాత చైనా ఓపెన్లో పోటీపడిన భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు... రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఆ ఓటమికి కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో బదులుతీర్చుకోవాలని చూస్తోంది. మంగళవారం ఆరంభమయ్యే ఈ టోర్నీలో అయిదో సీడ్ సింధు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
క్వాలిఫయింగ్ పోటీలతో పాటు డబుల్స్ విభాగాల మ్యాచ్లు ఈరోజు నుంచే ప్రారంభంకానున్నాయి. మెయిన్ డ్రా సింగిల్స్ మాత్రం బుధవారం మొదలవుతాయి.