థాయ్లాండ్ వైద్యులపై భారత్ బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశాడు. థాయ్లాండ్ ఓపెన్లో పాల్గొనడానికి అక్కడి వెళ్లిన శ్రీకాంత్.. వైద్యులు సరైన రీతిలో కరోనా పరీక్ష చేయలేదని ఆరోపించాడు. టోర్నీ కోసం థాయ్లాండ్ చేరుకున్న తర్వాత నాలుగు సార్లు కొవిడ్ టెస్టు చేయించుకోగా.. సోమవారం జరిపిన పరీక్షల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ముక్కులో గాయమై రక్తం వచ్చినట్లు వెల్లడించాడు. దానికి సంబంధించిన ఫొటోలను శ్రీకాంత్ ట్విట్టర్లో పంచుకున్నాడు.
"మేము ఇక్కడికి మ్యాచ్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. మా రక్తాన్ని చిందించడానికి కాదు. ఇక్కడికి చేరుకున్నాక నేను నాలుగు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను. ఈ టెస్టులు చేసే విధానంలో నేను అసంతృప్తి చెందాను. దీన్ని నేను అంగీకరించను."