తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రకాశ్ పదుకొనే అకాడమీతో ఇన్ఫోసిస్ ఒప్పందం

బ్యాడ్మింటన్ క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు ఇన్ఫోసిస్ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

By

Published : Sep 6, 2019, 5:45 AM IST

Updated : Sep 29, 2019, 2:50 PM IST

ప్రకాశ్

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బ్యాడ్మింటన్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే అకాడమీతో భాగస్వామ్యం ఏర్పర్చుకుంది.

ఇందుకు సంబంధించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్​ సుధా మూర్తి, ప్రకాశ్ పదుకొనే బెంగళూరులో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం అకాడమీకీ ఐదేళ్లకు గానూ 16 కోట్లను సమకూర్చనుంది ఇన్ఫోసిస్ ఫౌండేషన్.

"ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఐదేళ్లకు 16 కోట్లు. వారు ఎవరిని, ఎలా ఎంపిక చేస్తారు, ఎలా శిక్షణ ఇస్తారన్నది అకాడమీ ఇష్టం. ఫలితం మాత్రం అద్భుతంగా ఉండాలి. దేశంలోని క్రీడాకారుల ప్రతిభను బయటకు తీయాలి."

-సుధా మూర్తి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్

ప్రస్తుతం బెంగళూరులోని.. పదుకొనే అకాడమీలో 45 మంది ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. వీరిని 65కు పెంచుతామని సుధామూర్తికి తెలిపారుపదుకొనే. బెంగళూరును బ్యాడ్మింటన్​ హబ్​గా మార్చాలని క్రీడాశాఖను కోరుతామని చెప్పారు.

ఇవీ చూడండి.. 'మీకు మాత్రమే చెప్తా' టీజర్ వచ్చేది రేపే

Last Updated : Sep 29, 2019, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details