తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొరియా ఓపెన్​లో భారత షట్లర్లకు నిరాశ - కొరియా ఓపెన్​లో భారత షట్లర్లకు నిరాశ

ఇంచియాన్​ వేదికగా జరుగుతోన్న కొరియా ఓపెన్​లో భారత షట్లర్లు నిరాశపర్చారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్​లో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, పురుషుల్లో సాయి ప్రణీత్​ తొలి రౌండ్​లోనే ఇంటిముఖం పట్టారు.

సింధు - ప్రణీత్

By

Published : Sep 25, 2019, 1:57 PM IST

Updated : Oct 1, 2019, 11:27 PM IST

కొరియా ఓపెన్​ సింగిల్స్​ విభాగంలో భారత షట్లర్లు సత్తాచాటలేకపోయారు. బుధవారం జరిగిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, పురుషుల్లో సాయి ప్రణీత్​ తొలి రౌండ్​లోనే ఓటమిపాలయ్యారు. ఇటీవలే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో విజయకేతనం ఎగురవేసిన సింధు గత వారం జరిగిన చైనా ఓపెన్​లోనూ ఆకట్టుకోలేకపోయింది.

పుంజుకోవాలి సుమా...

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పసిడి గెలిచిన సింధుపై ఒలింపిక్స్​ స్వర్ణం గెలుస్తుందని ఎన్నో ఆశలున్నాయి. విశ్వక్రీడలకు ముందే నిరూపించుకోవాల్సిన టోర్నీల్లో చతికిలపడుతోంది తెలుగమ్మాయి. స్వర్ణం గెలిచిన నెలలోనే రెండు వరుస టోర్నీల్లో పరాజయం చెందింది.

బుధవారం జరిగిన కొరియా ఓపెన్​ తొలి రౌండ్​ మ్యాచ్​లో జాంగ్‌ బీవెన్‌(అమెరికా)ను తలపడింది. తొలి గేమ్‌లో సింధు 21-7తో ఆధిపత్యం కనబర్చినా... తర్వాతి రెండు సెట్లను 22-24, 15-21తో బీవెన్‌ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్​ 56 నిముషాలపాటు జరిగింది. 2017లో సింధునే కొరియా ఓపెన్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది.

ప్రణీత్​ రిటైర్డ్​​ హర్ట్​...

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో కాంస్యం గెలిచిన సాయి ప్రణీత్​... ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్​లో బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్​లో గాయం కారణంగా రిటైర్డ్​​ హర్ట్​గా వెనుదిరిగాడు. 9-21, 7-11 తేడాతో ఐదో సీడ్​ అండ్రెస్​ అంటోన్​సన్​(డెన్మార్క్​)చేతిలో ఓటమిపాలయ్యాడు ప్రణీత్​.

ఇదీ చదవండి: పాక్​ నుంచి క్షేమంగా రావాలని లంక ఆటగాళ్ల పూజలు

Last Updated : Oct 1, 2019, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details