తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండియా ఓపెన్, సయ్యద్ మోదీ టోర్నీలు రద్దు

కరోనా కారణంగా రెండు బ్యాడ్మింటన్ టోర్నీలను రద్దు చేసింది బీడబ్ల్యూఎఫ్. ఇండియా ఓపెన్ సూపర్ 500, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

By

Published : Aug 28, 2020, 6:30 AM IST

ఇండియా ఓపెన్, సయ్యద్ మోదీ టోర్నీలు రద్దు
ఇండియా ఓపెన్, సయ్యద్ మోదీ టోర్నీలు రద్దు

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500, సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 టోర్నీలను ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) రద్దు చేసింది. ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఇండియా ఓపెన్‌ను కరోనా తీవ్రత దృష్ట్యా డిసెంబరుకు మార్చింది. సయ్యద్‌ మోదీ టోర్నీని నవంబరులో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ రెండు టోర్నీలను రద్దు చేస్తున్నట్లు గురువారం బీడబ్ల్యూఎఫ్‌ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details