తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండియా ఓపెన్​లో భారత షట్లర్ల హవా

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సింధు, శ్రీకాంత్, కశ్యప్ ఇండియా ఓపెన్​లో సెమీఫైనల్ చేరారు.

By

Published : Mar 30, 2019, 10:50 AM IST

శ్రీకాంత్, సైనా, కశ్యప్

ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మెరిశారు. కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, పీవీ సింధు సెమీస్​లో​ బెర్తులు ఖరారు చేసుకున్నారు.

పురుషుల సింగిల్స్​ క్వార్టర్స్​లో మాజీ ఛాంపియన్ శ్రీకాంత్ 21-23, 21-11, 21-19 తేడాతో భారత్​కే చెందిన సాయిప్రణీత్​పై గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21-16, 21-11తో చైనీస్ తైపీ ఆటగాడు వాంగ్ జువ్​పై నెగ్గాడు. నాలుగేళ్ల తర్వాత కశ్యప్ వరల్డ్ టూర్ టోర్నీలో సెమీస్ చేరడం విశేషం. నేడు జరిగే సెమీ ఫైనల్లో హువాంగ్ యుజియాంగ్ (చైనా)తో శ్రీకాంత్, ఆక్సెల్​సన్ (డెన్మార్క్)తో కశ్యప్ తలపడనున్నారు.

మహిళల సింగిల్స్ క్వార్టర్స్​లో పీవీ సింధు 21-19, 22-20 తేడాతో డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లిచ్​ఫెట్​పై విజయం సాధించింది. నేడు జరగనున్న సెమీస్​లో బింగ్ జియావో (చైనా)తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది.

పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఇండియాకు చెందిన సుమిత్ రెడ్డి-మనూ ఆత్రి ద్వయం 21-10 21-12తో మరో భారత జోడీ ప్రణవ్ చోప్రా-శివమ్ వర్మను ఓడించి సెమీ ఫైనల్ చేరింది.

ఇవీ చూడండి. .అజ్లాన్​ షా హాకీ టోర్నీలో భారత్​ X కొరియా

ABOUT THE AUTHOR

...view details