తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2019, 8:18 PM IST

ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​: క్వార్టర్స్​లో ముగిసిన సైనా పోరాటం

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిరుత్సాహపరిచింది. పతకంపై ఆశలతో టోర్నీలో అడుగుపెట్టిన తెలుగుతేజం... క్వార్టర్స్​లోనే ఇంటిముఖం పట్టింది.

ఫ్రెంచ్​ ఓపెన్​: సైనా పోరాటం ముగిసెన్​

ప్యారిస్​ వేదికగా జరగుతున్న ఫ్రెంచ్​ ఓపెన్​లో... మాజీ ప్రపంచ నెం.1​ సైనా నెహ్వాల్​ ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వరుససెట్లలో పరాజయం చెందింది.

గత వారం డెన్మార్క్​ ఓపెన్​లో సింధును ఓడించిన అన్​సే యంగ్​ (దక్షిణకొరియా)... ఈ టోర్నీలో సైనాకు షాకిచ్చింది. శుక్రవారం జరిగిన పోరులో 20-22, 21-23 తేడాతో అన్‌సే యంగ్ (కొరియా) చేతిలో ఖంగుతింది సైనా. గాయం తర్వాత మళ్లీ రాకెట్​ పట్టిన 7వ సీడ్​ సైనా... ఈ సూపర్​ 750 టోర్నీలో గట్టి ప్రత్యర్థులైనా చెంగ్​ న్యాన్​ యి (హాంకాంగ్​), లియానే (డెన్మార్క్​)లను ఓడించింది. ఇటీవల పాల్గొన్న మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌కే పరిమితమైంది. కానీ ఈ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు వెళ్లింది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత పీవీ సింధు...తర్వాతి మ్యాచ్​లో టాప్ సీడ్ తైజు యింగ్ (చైనీస్ తైపీ)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పీవీ సింధు విజయం సాధిస్తే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఇటీవల ముగిసిన డెన్మార్క్, చైనా, కొరియా ఓపెన్లలో ఈ ప్లేయర్​ చేతిలోనే సింధు ఓడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details