తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2019, 3:44 PM IST

ETV Bharat / sports

చైనా ఓపెన్​లో రెండో రౌండ్​కు ప్రణీత్

బుధవారం జరిగిన చైనా ఓపెన్ తొలి రౌండ్​లో గెలిచిన భారత షట్లర్ సాయి ప్రణీత్... రెండో రౌండ్​కు అర్హత సాధించాడు.

చైనా ఓపెన్​లో రెండో రౌండుకు ప్రణీత్

చైనా ఓపెన్​లో భారత పురుష షట్లర్లు సత్తాచాటుతున్నారు. ఇప్పటికే పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్​కు చేరుకోగా.. స్టార్ ఆటగాడు సాయి ప్రణీత్ ముందంజ వేశాడు. తొలి రౌండ్​లో ఇండోనేసియాకు చెందిన టామీ సుగియార్టోపై విజయం సాధించాడు.

15-21, 21-10, 21-10 తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు ప్రణీత్. 52 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​ తొలి సెట్​లో పరాజయం పాలైన భారత షట్లర్... అనంతరం పుంజుకున్నాడు. తర్వాతి రెండు గేముల్లోనూ ఆధిపత్యం సాధించి రెండో రౌండ్​కు చేరాడు.

ప్రణీత్ తనతర్వాతి మ్యాచ్​లో డెన్మార్క్ క్రీడాకారుడు ఆండెర్స్ ఆంటోన్సన్​తో తలపడనున్నాడు. ఇప్పటికే భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ABOUT THE AUTHOR

...view details