తెలంగాణ

telangana

ETV Bharat / sports

తెలంగాణలో పచ్చదనం బాగా పెరిగింది: గోపీచంద్

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్.. తెలంగాణలో పచ్చదనం బాగా పెరిగిందని, ప్రజల్లో ఈ విషయమై చాలా అవగాహన వచ్చిందని అన్నారు.

By

Published : Jul 25, 2020, 10:43 AM IST

తెలంగాణలో పచ్చదనం బాగా పెరిగింది: గోపీచంద్
బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విసిరిన సవాలును స్వీకరించి, గచ్చిబౌలిలోని తన అకాడమీ ఆవరణలోని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రీన్​ఇండియా ఛాలెంజ్​లో పుల్లెల గోపీచంద్

హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వల్ల తెలంగాణలో పచ్చదనం బాగా పెరిగిందని చెప్పారు. ప్రజల్లోనూ చాలా అవగాహన వచ్చిందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్​కు కృతజ్ఞతలు తెలిపారు. షట్లర్లు సిక్కి రెడ్డి, మేఘన, అరుణ్ విష్ణులకు మొక్కలు నాటమని ఛాలెంజ్ విసిరారు.

మొక్కతో సెల్ఫీ తీసుకుంటున్న పుల్లెల గోపీచంద్

ABOUT THE AUTHOR

...view details