తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇండియన్ పాటకు ఇండోనేషియన్ల పేరడి - పాట

షారుఖ్ చిత్రం 'కుచ్ కుచ్ హోతాహై' సినిమాలోని పాటను ఇండోనేషియా అభిమానులు పేరడి చేశారు. తుమ్ పాస్ ఆయే తుమ్ ముస్కు రాయే అంటూ అచ్చుగుద్దినట్టు అనుకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇండోనేషియా

By

Published : Mar 30, 2019, 2:38 PM IST

Updated : Mar 30, 2019, 3:58 PM IST

బాలీవుడ్ బాద్​ షా షారుఖ్​ ఫ్యాన్​ ఫాలోయింగ్ విదేశాల్లోనూ పెరుగుతోంది. ఆయన సినిమాల్లో మరిచిపోలేని చిత్రం "కుచ్​కుచ్ హోతా హై". తాజాగా ఈ మూవీలోని "తుమ్ పాస్​ ఆయే యూముస్కు రాయే" పాటను ఇండినేషియాకు చెందిన ముగ్గురు అభిమానులు పేరడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

షారుఖ్, కాజోల్, రాణి ముఖర్జి నటించిన ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ప్రస్తుతం అలాగే అచ్చుగుద్దినట్టు అనుకరించారు ఇండోనేషియా అభిమానులు. విదేశీయులు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్​లో ఈ వీడియోను 14లక్షల మంది వీక్షించారు.

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్​జోహార్ తొలి చిత్రమైన 'కుచ్​ కుచ్​ హోతా హై' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడుతో సహా 8 విభాగాల్లో ఫిల్మ్​ఫేర్ అవార్డులను అందుకుంది. ఆ ఏడాది ప్రేక్షకులను అలరించిన చిత్రంగా జాతీయ పురస్కారాన్నీ కైవసం చేసుకుంది.

భారతీయ చిత్రాలకు ఇండోనేషియాలో ఆదరణ ఎక్కువ. రెండేళ్ల క్రితం రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలో పాటనూ ఆలపించింది ఇండోనేషియాకు చెందిన ఓ బృందం. 'సాహో రే బాహుబలి' అంటూ పాడుతూ శ్రోతలను ఆకట్టుకుంది.

Last Updated : Mar 30, 2019, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details