తెలంగాణ

telangana

By

Published : May 12, 2021, 8:45 AM IST

Updated : May 12, 2021, 11:33 AM IST

ETV Bharat / sitara

'చెప్పుల దండ వేస్తామని బెదిరించారు'

ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'. తాజాగా ఈ కార్యక్రమానికి బుల్లితెర జోడీ నిరుపమ్, మంజుల విచ్చేశారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Nirupam
నిరుపమ్

డాక్టర్‌బాబుగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారు బుల్లితెర నటుడు నిరుపమ్‌. ఎంతోపేరు తీసుకొచ్చిన ఆ సీరియళ్ల వల్లే తనకు సినిమా అవకాశం చేజారిపోయిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎందుకలా జరిగిందో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పంచుకున్నారు. తన భార్య మంజులతో కలిసి తాజాగా సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధాలు ఇచ్చారు. సీరియల్‌ను సీరియల్‌లా కాకుండా వ్యక్తిగతంగా తీసుకుంటేనే సమస్యలు వస్తాయని, అలాంటి కొందరు తనకు ఫోన్‌ చేసి చెప్పుల దండ వేసి సన్మానిస్తామని బెదిరించారని నిరుపమ్ చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలియాలంటే.. మే 17 ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమోను చూసి ఆనందించండి.

Last Updated : May 12, 2021, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details