తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2020, 9:26 AM IST

ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్​సిటీలో 'నా పేరు మీనాక్షి' షూటింగ్

ఈటీవీ సీరియల్​ 'నాపేరు మీనాక్షి'​ షూటింగ్​ తిరిగి ప్రారంభమైంది. లాక్​డౌన్​ కారణంగా దాదాపు 2నెలలకు పైగా నిలిచిపోయిన చిత్రీకరణ.. రామోజీ ఫిల్మ్​సిటీలో జరుపుకుంటోంది.

etv serial naa peru meenakshni shooting started at ramuji film city
రామోజీ ఫిలిం సిటీలో 'నా పేరు మీనాక్షి' షూటింగ్

కరోనాతో విధించిన లాక్​డౌన్​ వల్ల దాదాపు రెండు నెలలకు పైగా నిలిచిపోయిన సినిమా, సీరియల్స్​ షూటింగులు క్రమక్రమంగా మొదలవుతున్నాయి. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న 'నా పేరు మీనాక్షి' సీరియల్​ చిత్రీకరణ.. రామోజీ ఫిల్మ్​సిటీలో పునఃప్రారంభమైంది. నవ్య, వీణ, రమేశ్​, గౌతవి, కోట శంకరరావు, సుబ్బరాయ శర్మ తదితరలు ఈ ధారావాహికలో నటిస్తున్నారు. ధారావాహిక ప్రారంభమైనప్పటి నుంచి విజయపథంలో నడుస్తూ.. 1500 ఎపిసోడ్​ మైలురాయిని దాటింది. ఆర్కా మీడియా పతాకంపై నిర్మాతలు ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డల పర్యవేక్షణలో​ తెరకెక్కుతోంది.

కథేంటంటే...

భర్తను కోల్పోయిన మీనాక్షి, కుటుంబానికి దూరంగా జీవిస్తుంటుంది. దీపిక అగర్వాల్‌ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, తన భర్త క్రిష్‌ ఆశయాన్ని నెరవేర్చాలని దృఢ సంకల్పంతో ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఆమెకు అండగా ప్రేమ్‌-జానులు నిలబడతారు. ప్రేమ్‌-జానులను దూరం చేస్తే తప్ప మీనాక్షిని ఎదుర్కోలేనని తెలుసుకున్న దీపిక అగర్వాల్‌ అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నుతుంది. అగర్వాల్‌ కుట్రను తెలుసుకున్న మీనాక్షి ఏం చేసింది? ప్రేమ్‌-జానుల పెళ్లి ఎలా జరిపించింది? లాంటి ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు యాట సత్యనారాయణ.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details