తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దంగల్​ చిత్రం.. చైనా అధ్యక్షుడ్నే మెప్పించింది'

బాలీవుడ్​లో సూపర్ హిట్​గా నిలిచిన 'దంగల్'​ చిత్రాన్ని చైనా అధ్యక్షుడు జినిపింగ్ వీక్షించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హరియాణా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రెజ్లర్​ బబితా ఫోగాట్ పోటీ చేస్తోన్న చర్​ఖీ దాద్రీలో ర్యాలీకి హాజరయ్యారు మోదీ.

By

Published : Oct 15, 2019, 6:32 PM IST

Updated : Oct 16, 2019, 11:52 AM IST

'దంగల్​ చిత్రం... చైనా అధ్యక్షుడ్నే మెప్పించింది'

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్.. 'దంగల్'​ సినిమాను చూసినట్లు తనతో చెప్పారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల తమిళనాడు మామల్లపురంలో జిన్​పింగ్​తో భేటీ అయినప్పుడు ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారన్నారు. హరియాణా చర్​ఖీ దాద్రీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని వెల్లడించారు మోదీ.

దంగల్​ సినిమా గురించి ర్యాలీలో మాట్లాడుతున్న మోదీ

"చైనా అధ్యక్షుడిని ఇటీవలే కలిశాను. అనధికారిక సమావేశంలో పాల్గొన్నాం. చాలా విషయాలు చర్చించాం. 'దంగల్'​ సినిమా చూశానని చైనా అధ్యక్షుడు నాతో గర్వంగా చెప్పారు. మహిళలు ఎంత అద్భుత ప్రతిభ కనుబరుస్తున్నారో తెలిసిందన్నారు. ఆ మాటలు వినగానే హరియాణాపై గర్వంతో ఉప్పొంగిపోయా"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

దాద్రీ అసెంబ్లీ స్థానం నుంచి రెజ్లర్​ బబితా ఫోగాట్ భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె జీవిత కథ ఆధారంగానే బాలీవుడ్​లో దంగల్​ సినిమా తెరకెక్కింది. ఆమిర్​ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా 2016లో విడుదలై అత్యధిక వసూళ్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని చైనాలోనూ భారీ ఎత్తున విడుదల చేశారు. డ్రాగన్​ దేశంలోనూ వసూళ్ల వర్షం కురిపించింది దంగల్​.

ఇదీచూడండి: 'దేశం సంతోషంగా ఉంటే.. కాంగ్రెస్​కు నచ్చదు'

Last Updated : Oct 16, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details