తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రణవ'గీతం': రెండక్షరాలతో ర్యాప్​.. - తెలుగు సినిమా వార్తలు

ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఓ ర్యాప్​సింగర్​ రెండు అక్షరాలను సాహిత్యంగా మలిచి, సంగీతాన్ని జోడించి పాటగా రూపొందించాడు. ఈ పాట వినేందుకు గమ్మత్తుగా ఉన్నా ఎంతో లోతైన అర్థాలు దాగున్నాయి. ఇంతకూ ఈ కళకు ప్రాణం పోసిన ఆ వ్యక్తి ఎవరు?

రెండక్షరాలతో ర్యాప్​ సాంగ్​

By

Published : Nov 5, 2019, 7:10 PM IST

రెండక్షరాలతో లోతైన అర్థాన్నిచ్చే ర్యాప్​ సాంగ్​

ఓ వ్యక్తి కేవలం రెండు తెలుగు అక్షరాలను తీసుకుని సాహిత్యానికి కొత్త రూపాన్నందించి పాటగా మలిచాడు. అందుకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించి ఈ లోకానికి పరిచయం చేశాడు. అతనే ప్రణవ్​ చాగంటి. ఇతను ఓ రాప్​ సింగర్​. తెలుగు భాషపై మక్కువ ఉన్న ఈ యువ గాయకుడు... మాతృభాషకు జరుగుతోన్న అవమానాన్ని తట్టుకోలేక భాషను బతికించాలని కంకణం కట్టుకున్నాడు. ఇందుకోసం ఉద్యోగానికి రాజీనామా చేసి... అచ్ఛమైన తెలుగులో ర్యాపర్​గా ప్రయాణం మొదలుపెట్టాడు.

వైవిధ్యమైన పాటలతో ఇప్పుడిప్పుడే క్రేజ్​ తెచ్చుకుంటోన్న ర్యాపర్ ప్రణవ్​​... ఇటీవల ఓ సరికొత్త ప్రయోగం చేశాడు. ప్రపంచంలోనే తొలిసారిగా 'న, మ' అనే రెండు అక్షరాలతో 'మోడ్రన్​ దివ్యాక్షరి' పేరుతో పాటను విడుదల చేశాడు. వినేందుకు గమ్మత్తుగా ఉన్నా ఎంతో లోతైన అర్థాన్ని ఇచ్చేలా పాటను కూర్చాడు.

యాసిడ్​ ఘటనతో పుట్టిన 'ఆవేదన' ర్యాప్​

2004లో దిల్లీలో జరిగిన యాసిడ్​ దాడి ఘటనతో కలత చెందాడు ప్రణవ్​. అప్పుడే 'ఆవేదన' పేరుతో ప్రత్యేక ర్యాప్​ రూపొందించాడు. ఆ తర్వాత తెలుగువీర, పానీపూరి, తల్లి భారమా, హైదరాబాద్​ చాయ్​, ఏది నీ కులం వంటి ప్రత్యేక గీతాలకు ప్రాణం పోశాడు. త్వరలో సెకన్​కు 9.25 అక్షరాలతో అత్యంత వేగంగా పాడిన ఓ పాటను విడుదల చేస్తున్నట్లు ప్రణవ్​ తెలిపాడు.

ఇదీ చదవండి: సమీక్ష : 'మీకు మాత్రమే చెప్తా' ఎలా ఉందంటే.

ABOUT THE AUTHOR

...view details