తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆస్కార్' ఎంపికలో భారత సినీ ప్రముఖులు

ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీ సభ్యులుగా కొత్తగా 59 దేశాలకు చెందిన 842 మందికి అవకాశం దక్కింది. భారతదేశానికి చెందిన అనుపమ్ ఖేర్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్ ఈ జాబితాలో ఉన్నారు.

By

Published : Jul 2, 2019, 4:34 PM IST

'ఆస్కార్' ఎంపికలో భారత సినీ ప్రముఖులు

ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీ కొత్త సభ్యులుగా వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖుల్ని ఆహ్వానించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. భారతదేశం నుంచి దర్శకులు జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్​తో పాటు నటుడు అనుపమ్ ఖేర్​ ఇందులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 842 మంది కొత్త వారికి ఈ అవకాశం దక్కింది. ఇందులో సగానికి పైగా మహిళలున్నారు. వీరితో పాటే 21 మంది ఆస్కార్ విజేతలు, 82 మంది ఆస్కార్​ నామినేషన్​ పొందిన వారు ఈ జాబితాలో ఉండటం విశేషం.

అనురాగ్ కశ్యప్-జోయా అక్తర్-అనుపమ్ ఖేర్

బాలీవుడ్​తో పాటు హాలీవుడ్​లోనూ 'హోటల్ ముంబయి', 'ది బిగ్ సిక్​'తో తనదైన ముద్రవేశారు అనుపమ్ ఖేర్. ఇటీవలే 'గల్లీబాయ్'తో ఆకట్టుకున్నారు దర్శకురాలు జోయా అక్తర్. బాలీవుడ్​ ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్​కు అవకాశం దక్కింది.

వీరితో పాటే దర్శక-రచయిత రితేశ్ బత్రా, దర్శకుడు నిషా గనత్రా, భారత మూలాలున్న బ్రిటీష్ నటి ఆర్చి పంజాబీ, విజువల్ ఎఫెక్ట్స్​ విభాగంలో షెర్రీ భద్ర, శ్రీనివాస్ మోహన్.. ఆస్కార్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2018 లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యకమానికి 928 మందిని ఆహ్వానించింది. భారత్ నుంచి షారుఖ్ , మాధురీ దీక్షిత్, నషారుద్దీన్ షా వంటి ప్రముఖులు ఉన్నారు.

ఆస్కార్ అవార్డు

ఇది చదవండి: అలా 'ఖైదీ'.. 'సాగర సంగమం' అయింది

ABOUT THE AUTHOR

...view details