తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలోనే 'జాంబిరెడ్డి' సీక్వెల్ - ప్రమోషన్​లో భాగంగా విజయవాడ వచ్చిన జాంబీరెడ్డి చిత్రబృందం

ఈ నెల 26న ఓటీటీ వేదిక 'ఆహా'లో జాంబీరెడ్డి విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్​లో భాగంగా చిత్ర బృందం ఏపీలోని విజయవాడలో సందడి చేసింది. కరోనా తరువాత రిలీజైనా.. ప్రేక్షకులు చిత్రాన్ని ఎంతగానో ఆదరించారంటూ హీరో, దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు.

vja Jambireddy cinema unit
vja Jambireddy cinema unit

By

Published : Mar 23, 2021, 10:15 PM IST

జాంబీ రెడ్డి చిత్ర బృందం ఏపీలోని విజయవాడలో సందడి చేసింది. హీరోగా తొలి సినిమా విజయం సాధించడం సంతోషంగా ఉందని కథానాయకుడు తేజ అన్నారు. కరోనా తరువాత సినిమా విడుదలైనా ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాన్ని థియేటర్​లో వీక్షించని వారికోసం.. 'ఆహా'లో ఈనెల 26న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మొదటిసారిగా జాంబీస్​ని టాలీవుడ్​లో పరిచయం చేశామని చిత్ర దర్శకులు ప్రశాంత్ వర్మ తెలిపారు. ప్రమోషన్​లో భాగంగా విజయవాడకు వచ్చామన్నారు. రాయలసీమ నేపథ్యంలో కామెడీ, హర్రర్ చిత్రం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జాంబిరెడ్డి-2 ని త్వరలో తెరకెక్కిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details