తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మనసు మార్చుకున్న జైరా వసీం.. మళ్లీ వచ్చేసింది - సామాజిక మాధ్యమాలను వదిలిన జైరా వసీం

'దంగల్' ఫేమ్ జైరా వసీం చేసిన ట్వీట్ వివాదం సృష్టించడం వల్ల సోషల్ మీడియాను వీడిందీ నటి. అయితే ఒక్కరోజులోనే మళ్లీ అకౌంట్లను పునరుద్ధరించింది.

జైరా వసీం
జైరా వసీం

By

Published : May 30, 2020, 6:44 PM IST

'దంగల్' ఫేమ్ జైరా వసీం చేసిన ఓ ట్వీట్​పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఆమె సామాజిక మాధ్యమాలను వీడింది. అయితే ఒక్కరోజులోనే మనసు మార్చుకుని మళ్లీ సోషల్ మీడియాకు రీఎంట్రీ ఇచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా తెలిపింది.

"నేను కూడా ఓ మనిషినే. అందరూ కోరుకునే లాగా నాకూ కాస్త విరామం అవసరమనిపించింది. నా తల హీటెక్కిపోయింది. అటువంటి సందర్భంలో విరామం తీసుకున్నా."

-జైరా వసీం, మాజీ నటి

ప్రస్తుతం దేశంలో మిడతలు పంటలను నాశనం చేస్తున్నాయి. దీనిని సమర్థించేలా "అందుకే మేము వారిపైకి వరదలు, మిడతలు, పేలు, కప్పలు, రక్తాన్ని పంపాము. దీనికి కారణం వారికి కూడా తెలుసు. అయితే వారు అహంకారంలో కళ్లుమూసుకుపోయి ఉన్నారు. వారంతా అసలైన పాపాత్ములు" అంటూ ఖుురాన్​లోని వ్యాఖ్యలను ట్వీట్ చేసింది జైరా. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా సామాజిక మాధ్యమ అకౌంట్లను తొలగించింది జైరా.

ఇటీవలే జైరా వసీం నటనకు గుడ్​బై చెప్పింది. చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. నటనలో భాగంగా తన నమ్మకాన్ని, మతం విలువలను విడిచిపెట్టి జీవించాల్సి వస్తోందనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వివరించింది.

ABOUT THE AUTHOR

...view details