తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ముంబయి.. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లా అనిపిస్తోంది' - కంగనా రనౌత్​

శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​.. తనను ముంబయి రావొద్దంటూ బెదరించినట్లు ఆరోపించింది బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్​. ముంబయి.. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లా అనిపిస్తోందని వెల్లడించింది.

Kangana
కంగనా

By

Published : Sep 3, 2020, 4:44 PM IST

Updated : Sep 3, 2020, 5:30 PM IST

శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​పై బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయన తనను ముంబయి తిరిగి రావొద్దని బెదరించినట్లు ఆరోపించింది. ఈ విషయమై ట్వీట్​ చేసిందీ నటి.

"శివసేన నాయకుడు సంజయ్​ రౌత్.. నన్ను ముంబయికి రావొద్దంటూ​ బహిరంగంగానే బెదరింపులకు పాల్పడుతున్నారు. వీధుల్లో ఆజాదీల గ్రాఫిటీస్, ఇపుడు నగరానికి నన్నేమో రావొద్దని బెదిరింపులు.. అసలు ఎందుకు ముంబయి.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​లా అనిపిస్తోందీ.?"

-కంగనా ట్వీట్​.

బాలీవుడ్​ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే తాను ఎక్కువగా భయపడుతున్నట్లు ఇటీవల చెప్పింది కంగన. దీనిపై స్పందించిన సంజయ్​.. ఆమెను ముంబయికి రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలోనే కంగన ఈ ట్వీట్​ చేసింది.

ఇది చూడండి పవన్ రిప్లైను ఫ్రేమ్ కట్టించుకుంటా: సంపూ

Last Updated : Sep 3, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details