తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2019, 9:28 AM IST

ETV Bharat / sitara

చరణ్​-కొరటాల ప్రాజెక్ట్ ఆగింది ఆ కారణంతోనే!

మెగాహీరో రామ్​చరణ్​తో స్టార్ డైరక్టర్ కొరటాల శివ.. గతంలో ఓ సినిమా మొదలుపెట్టి ఆపేశాడు. ఈ విషయం గురించి, ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకు గల కారణాలు వివరించాడు.

చరణ్​-కొరటాల ప్రాజెక్ట్ ఆగింది ఆ కారణంతోనే!
రామ్​చరణ్​-కొరటాల శివ

కొన్ని చిత్రాలు ప్రారంభమై వివిధ కారణాలతో ఆగిపోతుంటాయి. ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఇది సహజం. నూతన నటీనటులు, దర్శకుల విషయంలో అయితే,సినీ ప్రియులు అంతగా ఆసక్తి చూపరు. అగ్ర హీరోలు-దర్శకుల కాంబినేషన్​లో అయితే, సినిమా ప్రకటించినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఫాలో అవుతూనే ఉంటారు. ఇలాంటి చిత్రాలు నిలిచిపోతే ఎందుకా? అని చర్చలు పెడతారు. రామ్‌ చరణ్, కొరటాల శివ మొదలుపెట్టిన ప్రాజెక్టు విషయంలో ఇదే జరిగింది.

తొలి చిత్రం 'మిర్చి' తర్వాత కొరటాల.. చరణ్​తో ఓ చిత్రం ప్రకటించి అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అప్పట్లో అది హాట్‌ టాపిక్‌. అయితే ఎందుకు ఆగిపోయింది? శివ చెప్పిన కథ చెర్రీకి బాగా నచ్చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ శివకు స్క్రిప్ట్‌ విషయంలో నమ్మకం ఏర్పడటం లేదు. ఏదో చిన్న సందేహం. ఎన్నిసార్లు మార్పు చేసినా అనుకున్నట్లు రావట్లేదు. ఇస్తే బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌ ఇవ్వాలి, అంతేకాని తొందరపడి సినిమా ప్రకటించామని, ఏదో తీసేయడం బావుండదనుకున్నాడట శివ. ఇదే విషయాన్ని చెర్రీకి చెప్పాడు.

ఈ విషయంపై చరణ్.. "కథను తెరకెక్కించాల్సింది మీరే! నేను కేవలం మీరు చెప్పింది చేస్తాను. ఈ విషయంలో మీరే కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఈ కథపై ఎప్పుడు నమ్మకం వస్తే అప్పుడే చిత్రీకరణ మొదలెడదాం" అని స్నేహపూర్వకంగా తనతో అన్నాడని, ఓ సందర్భంలో చెప్పాడు కొరటాల.

కొరటాల శివ ప్రస్తుతం.. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్‌ చరణ్‌ నిర్మాత. మణిశర్మ సంగీత దర్శకుడు. థాయ్​లాండ్​లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. జనవరి నుంచి షూటింగ్​ మొదలు కానుందని సమాచారం.

ఇది చదవండి: మసాజ్ 'ల్యాండ్​'లో 'చిరు 152' కోసం మ్యూజిక్ సిట్టింగ్స్

ABOUT THE AUTHOR

...view details