2011లోనే తెరంగేట్రం చేసిన విజయ్ దేవరకొండ, 2016లో పెళ్లి చూపులు సినిమాతో మంచి ఫేం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' సినిమాతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టి టాప్ హీరో అయ్యాడు. అయితే ఈ సినిమా భారీ విజయం తర్వాత ఏ మంత్రం వేశావే, నోటా, ద్వారక సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాలు కలెక్షన్లు రాబట్టినా... భారీ హిట్ జాబితాలో నిలవలేదు. అందుకే తన కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ కోసం పేరు మార్చుకున్నాడా అనేది ఓ టాక్ వినిపిస్తోంది.
వరల్డ్ ఫేమస్ లవర్లో విజయ్దేవరకొండ గతేడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పలు పోస్టర్లు విడుదల చేసింది చిత్రబృందం. అన్నింటిలో విజయ్ దేవరకొండ అనే ఉంది. అయితే కొత్త ఏడాది ప్రారంభమైన తర్వాత వచ్చిన టీజర్లో మాత్రం పేరు మారింది. ఈ ఏడాది కలిసిరావాలంటే ఈ మార్పులు ఎవరైనా సూచించారా అనేది మరో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతం విజయ్ దేవరకొండ...'దేవరకొండ విజయ్ సాయి'గా మారిపోయాడు.
నలుగురు కథానాయికలతో విజయ్ 'మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు' ఫేం క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లె లైట్ కథానాయికలు. గోపీ సుందర్ బాణీలు అందిస్తున్నారు.
రాశీఖన్నా... యామినా...!
అర్జున్రెడ్డి లాంటి బోల్డ్ కథాంశంతో వస్తోన్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైంది. "ప్రేమంటే రాజీ గౌతమ్.. ప్రేమంటే త్యాగం.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావు.." అని ఓ అమ్మాయి అంటున్న డైలాగ్తో వీడియో ఆరంభమైంది. ఇందులో విజయ్ నలుగురు కథానాయికలు రాశీ, ఐశ్వర్య, కేథరిన్, ఇజబెల్లెతో మంచి కెమిస్ట్రీ పండించాడు. కొన్ని సన్నివేశాల్లో మరో 'అర్జున్ రెడ్డి' గుర్తొచ్చాడు. టీజర్లో కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. అయితే టీజర్ ఆఖర్లో బోల్డ్ డైలాగ్ను వినిపించాడు. అందులో విజయ్ 'యామిని' అని పలికిన పాత్ర పేరు ఎవరనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. తాజాగా రౌడీహీరో పాత ట్వీట్ ఆ ప్రశ్నకు సమాధానంగా మారింది. రాశీ ఖన్నా పాత్ర పేరే యామిని అని గతంలో ట్వీట్ చేశాడు రౌడీ హీరో. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
రాశీఖన్నా... యామిని అంటూ విజయ్ ట్వీట్