తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2020, 7:37 AM IST

ETV Bharat / sitara

పవన్​తో కలిసి నటించే మరో హీరో ఎవరు?

మలయాళీ హిట్​ చిత్రం..'అయ్యప్పనుమ్​ కోశియుమ్'ను తెలుగులో రీమేక్​ చేస్తున్నారు. ఇందులో పోలీస్‌ అధికారి పాత్ర పోషించనున్నారు​ పవన్ ​కల్యాణ్​. మరి ఇందులో పవర్​స్టార్​తో పాటుగా నటించే మరో కథానాయకుడెవరు?

who will be act as another hero role in telugu remake of ayyappan koshiyum
పవన్​తో కలిసి నటించే మరో కథానాయకుడెవరు?

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ ఒప్పుకొన్న వరుస చిత్రాల్లో 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌ ఒకటి. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించే బాధ్యతని యువ దర్శకుడు సాగర్‌ చంద్రకి అప్పజెప్పారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ఓ శక్తివంతమైన పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఇందులో మరో కథానాయకుడికీ చోటుంది. మరి ఆ పాత్రలో నటించేది ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పవన్​తో కలిసి నటించే మరో కథానాయకుడెవరు?

యువ కథానాయకుడు రానా దగ్గుబాటితో పాటు, కన్నడ నటుడు సుదీప్‌ పేర్లు వినిపించాయి. తాజాగా తమిళ నటుడు విజయ్‌సేతుపతితోనూ చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కథానాయిక ఎంపికపైనా చిత్రబృందం కసరత్తులు జరుపుతోంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌' చిత్రంతో బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి:700 కోట్ల వీక్షణలు సాధించిన వీడియో ఇదే

ABOUT THE AUTHOR

...view details