తన విలక్షణ నటనతో ప్రతినాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అమ్రిష్ పురి. ప్రముఖ దర్శకుడు స్పీల్బర్గ్ 1984లో తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం 'ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్'లో విలన్ మోలా రామ్గా నటించి మెప్పించారు. అయితే, ఈ సినిమా ఆఫర్ను మొదట్లో అమ్రిష్ తిరస్కరించారట.
తన ఆత్మకథ 'ది యాక్ట్ ఆఫ్ లైఫ్' ప్రకారం...టెంపుల్ ఆఫ్ డూమ్ను భారత్లో చిత్రీకరించేందుకు స్పీల్బర్గ్కు అనుమతి లభించలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ సినిమాను శ్రీలంక, మకావ్, లండన్లలో తెరకెక్కించారు. ఈ క్రమంలోనే కాస్టింగ్ డైరెక్టర్ డాలీ ఠాక్రే.. 'గెహ్రాయీ' హారర్ చిత్రంలోని అమ్రిష్ పురి స్టిల్స్ను స్పీల్బర్గ్కు పంపారు. అనంతరం అమెరికా నుంచి కాస్టింగ్ సిబ్బంది భారత్కు వచ్చి అమ్రిష్ను కలిసి ఆడిషన్కు రావాలని కోరారు. అయితే, అందుకు నిరాకరించిన నటుడు.. బదులుగా తన కొత్త సినిమాలో సెట్స్పై ప్రదర్శనను చూసుకోవాలని తెలిపారు. "స్పీల్ బర్గ్కు నా భాష తెలియదు. అతనికి నేను కేవలం ఒక నటుడిగా మాత్రమే తెలుసు" అంటూ కాస్టింగ్ బృందానికి సమాధానమిచ్చారు.
అలా హాలీవుడ్ చిత్రంలో..