నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో బాలీవుడ్లో చెలరేగిన బంధుప్రీతి(నెపోటిజమ్) చర్చ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సుశాంత్కు సినిమా అవకాశాలు రాకుండా చేశారని కొంత మంది సినీ ప్రముఖులపై సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు ఫ్యాన్స్. అయితే, ప్రముఖ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ మరో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. యశ్రాజ్ ఫిలింస్తో 'శుద్ధ్ దేశీ రొమాన్స్' సినిమా చేసేందుకు సుశాంత్.. 'హసీ తో ఫసీ'ని తిరస్కరించిన సంఘటనను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
"ముఖేశ్ ఛబ్రా నా కార్యాలయం నుంచే పనిచేసేవారు. 'హసీ తో ఫసీ' చిత్ర కథను తయారు చేసుకుని.. సుశాంత్తో కలిసి సినిమా ప్రారంభించాం. అదే సమయంలో పరిణతి చోప్రా వద్దకు వెళ్లి సుశాంత్ చిత్రం గురించి చెప్పా. ఆ తర్వాత యశ్రాజ్ ఫిలింస్ నుంచి సుశాంత్కు ఓ ఆఫర్ వచ్చింది. 'శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రంలో వైఆర్ఎఫ్ సుశాంత్తో ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల అతడు 'హసీ తో ఫసీ' సినిమాను వదులుకున్నాడు. అలా చేసినందుకు అతనిపై ఎటువంటి కోపం లేదు. సుశాంత్ చాలా తెలివైన వ్యక్తి. ఇప్పుడు అతని మరణాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి ఒక్కరినీ కిందికి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.'