తెలంగాణ

telangana

చక్రవర్తి 'చంద్రగుప్త మౌర్య'పై కంగనా సినిమా..?

By

Published : Jan 23, 2020, 7:37 PM IST

Updated : Feb 18, 2020, 3:49 AM IST

భవిష్యత్తులో చారిత్రక నేపథ్యంలో చిత్రాలు నిర్మించే అవకాశం ఉందని బాలీవుడ్​ క్వీన్​ కంగనారనౌత్​ తెలిపింది. సినీపరిశ్రమ.. చరిత్రకు తగిన న్యాయం చేయలేకపోయిందని విచారం వ్యక్తం చేసింది.

Want to make film on Chandragupta Maurya: Kangana Ranaut
'చరిత్రకు సినీపరిశ్రమ న్యాయం చేయలేకపోయింది'

మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యపై సినిమా నిర్మించాలన్న కోరికను​ వ్యక్తపరిచింది బాలీవుడ్​ క్వీన్​ కంగనారనౌత్. సినీ పరిశ్రమ.. చరిత్రకు తగిన న్యాయం చేయలేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. జాతీయ అవార్డు విజేతలతో ఓ హిందీ వార్త పత్రిక ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంగళవారం ఆమె హాజరైంది. అందులో భాగంగా భోజ్​పురీ నటుడు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

రవికిషన్​:-బిహార్​తో మీకున్న అనుబంధమేంటి?
కంగనా:- చివరిసారిగా నా చిన్నతనంలో వచ్చాను. ఇది రెండోసారి. నాకు యోగా నేర్పించిన గురువు ఇక్కడివారే.

రవికిషన్​:- ఇప్పటికే మణికర్ణిక లాంటి చారిత్రక సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా బిహార్​తో అనుబంధం ఉన్న ఏదైనా చారిత్రక నేపథ్య చిత్రాన్ని నిర్మించే అలోచనలు ఉన్నాయా?
కంగనా:- చరిత్రకు సినీపరిశ్రమ తగిన న్యాయం చేయలేకపోయింది. భవిష్యత్తులో చంద్రగుప్తమౌర్యపై సినిమా చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి.

రవికిషన్​:-కొంచెం బరువు పెరిగినట్టు ఉన్నారు?
కంగనా:- 'తలైవి' సినిమాలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పాత్ర కోసం బరువు పెరిగాను.

ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రవికిషన్​తో కలసి భోజ్​పురీ పాటకు స్టెప్పులేసింది. ఈ భామ ప్రస్తుతం ఓ చిత్రనిర్మాణ సంస్థ ప్రారంభించనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థ ద్వారా తెరకెక్కే మొదటి సినిమా అయోధ్య రామ మందిర నేపథ్యంలో ఉంటుందని సమాచారం. త్వరలోనే కంగనా నటించిన క్రీడానేపథ్య చిత్రం 'పంగా' విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదీ చూడండి.. అల్లు అర్జున్ ఇంట విషాదం.. 'ఏఏ20' నిర్మాత మృతి

Last Updated : Feb 18, 2020, 3:49 AM IST

ABOUT THE AUTHOR

...view details