*'విక్రమ్' ఫస్ట్లుక్ వచ్చేసింది. కమల్హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖాలతో రూపొందించిన ఈ లుక్.. అదరగొట్టింది. ముగ్గురు విలక్షణ నటులు ఉండటం వల్ల అంచనాలు పెరిగిపోతున్నాయి. 'మాస్టర్' ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి ఈ సినిమా వచ్చే అవకాశముంది.
*సినిమాలు, వెబ్ సిరీస్లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆహా.. త్వరలో కుకింగ్ షోతో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. 'ఆహా భోజనంబు' పేరుతో త్వరలో ఈ షోను ప్రసారం చేయనుంది. మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు వచ్చి వంట చేయనున్నారు!