కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. వారికి తోచిన సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు విజయ్సేతుపతి కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి రూ. 25లక్షల విరాళం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిసి ఈ విరాళాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు సహా ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించాలని కోరారు.
కరోనా బాధితులకు అండగా విజయ్సేతుపతి - Vijay Sethupathi donates 25 Lakhs
కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి అండగా నిలిచారు విలక్షణ నటుడు విజయ్సేతుపతి. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షల విరాళం ప్రకటించారు.
విజయ్సేతుపతి
అంతకు ముందు సూపర్స్టార్ రజనీకాంత్ రూ.50లక్షలు, ఆయన కుమార్తె సౌందర్య ఫ్యామిలీ రూ. కోటి విరాళం, సూర్య, ఆయన సోదరుడు కార్తి రూ.కోటి, చియాన్ విక్రమ్ రూ.30 లక్షలు, హీరోలు అజిత్, దర్శకుడు మురుగదాస్ చెరో రూ.25 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.
ఇదీ చూడండి: రజనీ రూ.50లక్షలు.. విక్రమ్ రూ.30 లక్షల విరాళం
Last Updated : Jun 15, 2021, 1:21 PM IST