తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2021, 12:58 PM IST

Updated : Jun 15, 2021, 1:21 PM IST

ETV Bharat / sitara

కరోనా బాధితులకు అండగా విజయ్​సేతుపతి

కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి అండగా నిలిచారు విలక్షణ నటుడు విజయ్​సేతుపతి​. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షల విరాళం ప్రకటించారు.

vijay sethupathi
విజయ్​సేతుపతి

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. వారికి తోచిన సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు విజయ్​సేతుపతి​ కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి రూ. 25లక్షల విరాళం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిసి ఈ విరాళాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు సహా ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించాలని కోరారు.

అంతకు ముందు సూపర్​స్టార్​ రజనీకాంత్​ రూ.50లక్షలు, ఆయన కుమార్తె సౌందర్య ఫ్యామిలీ రూ. కోటి విరాళం, సూర్య, ఆయన సోదరుడు కార్తి రూ.కోటి, చియాన్ విక్రమ్ రూ.30 లక్షలు, హీరోలు అజిత్‌, దర్శకుడు మురుగదాస్‌ చెరో రూ.25 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.

ఇదీ చూడండి: రజనీ​ రూ.50లక్షలు.. విక్రమ్ రూ.30 లక్షల విరాళం

Last Updated : Jun 15, 2021, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details