తెలంగాణ

telangana

By

Published : May 7, 2021, 7:46 PM IST

ETV Bharat / sitara

విజయ్ దేవరకొండ 'లైగర్' వాయిదా తప్పదా?​

విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'లైగర్' విడుదల కూడా వాయిదా పడనుంది. మహారాష్ట్రలో షూటింగ్​లపై తాత్కాలిక నిషేధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ 'లైగర్' వాయిదా
విజయ్ దేవరకొండ-అనన్య పాండే

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లలోకి రావాల్సిన ఎన్నో సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విజయ్ దేవరకొండ 'లైగర్​' కూడా చేరేలా కనిపిస్తోంది. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని తెలుస్తోంది.

పాన్ ఇండియా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్.. బాలీవుడ్​లోనూ అడుగుపెడుతున్నారు. ముంబయిలో ఎక్కువ శాతం షూటింగ్ జరుగుతోంది. అయితే కేసులు ఎక్కువగా వస్తున్న దృష్ట్యా, మహారాష్ట్రలో చిత్రీకరణలపై స్టే విధించారు. దీంతో అక్కడ జరగాల్సిన షెడ్యూల్​ వాయిదా పడింది. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక దానిని తిరిగి మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. ఇవన్నీ జరిగితే సెప్టెంబరు 9న థియేటర్లలోకి సినిమా రావడం కష్టమవుతుంది. ఇందులో భాగంగా కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశముంది.

విజయ్-పూరీ జగన్నాథ్-ఛార్మీ

అయితే 'లైగర్​' చిత్రాన్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ ఆలోచన ఏం లేదని నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్​గా నటిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకుడు.

ఇది చదవండి:'ఆదిపురుష్' షూటింగ్ ఇకపై హైదరాబాద్​లో!

ABOUT THE AUTHOR

...view details