తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2020, 6:01 AM IST

Updated : Feb 28, 2020, 11:14 PM IST

ETV Bharat / sitara

అటవీ అధికారిణిగా బాలీవుడ్​ నటి విద్యాబాలన్​

గతేడాది 'ఎన్టీఆర్​ కథానాయకుడు', 'మిషన్​ మంగల్'​తో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్​ నటి విద్యాబాలన్​.. ఈ ఏడాది మరో రెండు చిత్రాల్లో కనిపించనుంది. అటవీశాఖ అధికారిణిగా, గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతల జీవితకథల్లో నటించనుంది.

Vidya Balan to Play Forest Officer in Her Next Film Based on Killing of Tigress Avni
అటవీ అధికారిణిగా బాలీవుడ్​ నటి విద్యాబాలన్​

బాలీవుడ్​ కథానాయిక విద్యాబాలన్​ అటవీశాఖ అధికారిణిగా తెరపై కనిపించనుంది. వన్యప్రాణులపై కథాంశంతో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. కొన్ని వార్తల ప్రకారం.. 'అవ్ని' అనే ఆడపులిని చంపటం చూట్టూ ఈ కథ రూపొందుతోంది. అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం మహారాష్ట్రలో ఆడపులి 13 మందిని చంపినందుకు గానూ.. అవ్నిని 2018 నవంబర్‌లో షూటర్ కాల్చి చంపాడు.

అయితే, ఈ చిత్రం అవ్ని కేసు ఆధారంగా కాదని.. మనిషి-జంతు సంఘర్షణల ప్రధానాంశంగా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి వివరాల కోసం అధికార ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు టైటిల్​ను ఖరారు చేయలేదు. అబుండాంటియా ఎంటర్​టైన్మెంట్ పతాకంపై విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. విద్యా బాలన్​ ఈ చిత్రం తర్వాత గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతల దేవిపై తెరకెక్కే బయోపిక్‌లో కనిపించనుంది. ఈ చిత్రం మే 8 న విడుదల కానుంది.

ఇదీ చూడండి.. వైరల్​: సారా, కార్తీక్​ లెమన్​ స్పూన్​ డాన్స్​

Last Updated : Feb 28, 2020, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details