తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ నిర్మాత జానీ బక్షి కన్నుమూత - జానీ బక్షి

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత జానీ బక్షి కన్నుమూశారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

Johnny
జానీ బక్షి

By

Published : Sep 5, 2020, 7:23 PM IST

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత, దర్శకుడు జానీ బక్షి ఇక లేరు. శనివారం ముంబయిలోని ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాసకోస సమస్య వల్ల శుక్రవారం ఆసుపత్రిలో చేరిన బక్షి.. కరోనా పరీక్షల్లో నెగిటివ్​ తేలినట్లు ఆయన కుమార్తె ప్రియ తెలిపింది. ప్రస్తుతం ఆయన వయసు 82. కుటుంబ సభ్యుల సమక్షంలో నగరంలోని శ్మశాన వాటికలో అత్యక్రియలు నిర్వహించారు. జానీ బక్షి మృతికి నివాళులు అర్పిస్తూ.. పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రాణించిన బక్షి.. దర్శకుడిగా కంటే నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'మంజిలీన్​ ఔర్​ భీ హైన్'​, 'రావన్',' ఫిల్​ తేరీ కహానీ యాద్​ ఆయే' వంటి సూపర్​ హిట్​ చిత్రాలను నిర్మించారు. 'డాకు ఔర్​ పోలీస్'​, 'ఖుదాయ్​' చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ABOUT THE AUTHOR

...view details