తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెరపై మరోసారి 'వెల్లువచ్చి గోదారమ్మ' - వాల్మీకీ

'వాల్మీకి' కోసం అలనాటి హిట్​ గీతం 'వెల్లువచ్చి గోదారమ్మ'ను రీమేక్​ చేశారు. ఈ పాట మేకింగ్​ వీడియో ప్రస్తుతం వైరల్​ అవుతోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

వాల్మీకిలో వెల్లువచ్చి గోదారమ్మ పాట

By

Published : Sep 16, 2019, 7:29 PM IST

Updated : Sep 30, 2019, 8:55 PM IST

మెగాహీరో వరుణ్​తేజ్​ 'వాల్మీకి' కోసం అద్భుతమైన పాటను రీమేక్ చేశారు. శోభన్​బాబు, శ్రీదేవి జంటగా నటించిన దేవత చిత్రంలోని 'వెల్లువచ్చి గోదారమ్మ' గీతాన్ని.. వాల్మీకి కోసం తిరిగి రూపొందించారు. ఆ మేకింగ్​ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​ అవుతోంది. ఒరిజినల్​కు ఏ మాత్రం తీసిపోకుండా తెరకెక్కించినట్లు ఈ పాటను చూస్తుంటే తెలుస్తోంది.

ఇందులో హీరోయిన్​గా పూజా హెగ్డే నటిస్తోంది. అధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రతినాయక లక్షణాలున్న రోల్​లో కనిపించనున్నాడు వరుణ్​తేజ్. మిక్కీ జే మేయర్​ స్వరాలు సమకూర్చాడు. హరీశ్​ శంకర్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ప్లస్​ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు.

ఇదీ చూడండి: సైరా ప్రీరిలీజ్​ వాయిదా!.. మరి ట్రైలర్..?

Last Updated : Sep 30, 2019, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details