తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రేపు ట్రైలర్​తో రానున్న 'వాల్మీకి'

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'వాల్మీకి'. ఈ సినిమా ట్రైలర్​ సోమవారం విడుదలవనుంది.

By

Published : Sep 8, 2019, 9:06 PM IST

Updated : Sep 29, 2019, 10:19 PM IST

వాల్మీకి

మెగాహీరో వరుణ్ తేజ్‌ తొలిసారిగా ప్రతినాయక పాత్రలో నటించిన సినిమా 'వాల్మీకి'. తమిళ సూపర్‌ హిట్ 'జిగర్తాండ'కు ఇది రీమేక్​. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. కీలక పాత్రల్లో తమిళ నటుడు అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించనున్నారు..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్​డేట్​ను వెల్లడించింది చిత్రబృందం. రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు చిత్ర ట్రైలర్​ను విడుదల చేస్తామని ప్రకటించింది.

14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. కమర్షియల్ చిత్రాల్ని తెరకెక్కించే హరీశ్ శంకర్‌ దర్శకుడు. సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. 'బయోపిక్'​లలో ఈ చిత్రాలు వేరయా..!

Last Updated : Sep 29, 2019, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details